News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నైనా జైస్వాల్

Naina Jaiswal: యూరప్ లో జరిగే టేబుల్ టెన్నిస్ కి ట్రైనింగ్ జరుగుతోందని బాగా పెర్ఫార్మ్ చేస్తామని భావిస్తున్నన్నారు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు.

ఆనంనతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ నా పుట్టిన రోజును పురస్కరించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే నాకు చాలా ఇష్టమైన ప్రదేశం తిరుమల అని కొండ ఎక్కిన ప్రతిసారి కొండంత ధైర్యం నాలో వస్తుందని శ్రీ వేంకటేశ్వరుడే నా ధైర్యం అన్నారు. గతి తప్పిన ఈ లోకానికి సూర్య కాంతి అందించే క్షేత్రమే తిరుమల అని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button