జాతియం
కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో హైఅలర్ట్

Mumbai: కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో హైఅలర్ట్ కొనసాగుతోంది. తీరప్రాంత భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. 500 మందికిపైగా అదనపు బలగాలు మోహరించాయి. ప్రార్థనా మందిరాలు, రైల్వే స్టేషన్లు, మాల్స్ సహా ఇతర రద్దీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. మరోవైపు అప్రమత్తమైన బాంబ్ స్వ్కాడ్, ఏటీఎస్ బృందాలు డ్రోన్లతో నిఘా, నైట్ విజన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు.