ఆంధ్ర ప్రదేశ్
బావిలో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా గూడెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి సరస్వతి,వరలక్ష్మి అనే తల్లి,కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. 4 రోజుల కిందట వరలక్ష్మి కూతురు చంద్రిక జ్ఞానపురం చర్చిలో మృతి చెందింది.
అయితే బాలిక మృతితో మనస్థాపానికి గురైన తల్లి వరలక్ష్మి,అమ్మమ్మ సరస్వతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మృతదేహాలను శ్రీకాకుళం GGHకి తరలించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.