తెలంగాణ
MLC Kavitha: హైదరాబాద్ ధర్నాచౌక్లో ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష

MLC Kavitha: హైదరాబాద్ ధర్నాచౌక్లో ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్షకు దిగారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరసన చేపట్టారు. కులవివక్షకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే అవిశ్రాంతంగా పోరాటం చేశారని అన్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే సమాజం స్పూర్తి పొందుతుందని కవిత అన్నారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తామన్నారు. ధైర్యంగా ముందుకే వెళ్తాము తప్పా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఏప్రిల్ 11న పూలే విగ్రహంపై ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. రిజర్వేషన్ల పెంపునకు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసి సాధించామని కవిత తెలిపారు.