తెలంగాణ
MLC Kavitha: అసెంబ్లీలో కూడా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

MLC Kavitha: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మింట్ కాంపౌండ్ వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. పూలే విగ్రహ ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామన్నారు.
రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందన్నారామె. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుతో 9 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారామె. కాబట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలన్నారు కవిత. కులగణన వివరాలను గ్రామ పంచాయతీల వారీగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.