తెలంగాణ

MLC Kavitha: ఆపరేషన్ కగార్‌ పేరిట బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతోంది

MLC Kavitha: మంచిర్యాలలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్‌ పేరిట బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును ‌ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే కనీసం మానవత్వం కూడా చూపలేదన్నారు. అంతిమ సంస్కారం కోసం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం కూడా బీజేపీకి లేదని మండిపడ్డారు.

ఆపరేషన్ కగార్‌ను ఆపాలని పదే పదే కోరుతున్నా మారణకాండను కొససాగిస్తున్నారని విమర్శించారు. బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సరస్వతి నది పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకుండా కాంగ్రెస్ దళిత వ్యతిరేక వైఖరిని మరోసారి బయటపెట్టుకుందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button