ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లా బాలాజీనగర్లో మంత్రి నారాయణ పర్యటన

నెల్లూరు జిల్లా బాలాజీనగర్లో సైడ్ డ్రైన్ల పూడికతీత పనులను మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. పూడికతీతపనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులకు ఆదేశించారు. గత ఐదేళ్లలో డ్రైన్స్ లో సిల్ట్ పేరుకుపోయిందని వర్షాకాలంలో నీళ్ళు వెల్లలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు.
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 50 కోట్ల రూపాయలతో పూడికతీత పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. 13 వేల కోట్లతో ఇంటింటికి కుళాయి ఏర్పాటుకు టెండర్లు పిలవబోతున్నామన్నారు.