ఆంధ్ర ప్రదేశ్
Narayana: మూడేళ్లలో ఖచ్చితంగా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం

Narayana: ప్రధాని మోదీ రాక సందర్భంగా విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు నిఘా నీడలోకి వెళ్లింది. మోదీ రానుండటంతో ఎయిర్ పోర్టు సిబ్బంది కార్గో సర్వీసులను నిలిపివేసింది. అంతేకాదు ప్రధాన గేటు వద్దకి ఫ్లైట్ టికెట్ ఉన్నవారికే అనుమతి ఇస్తున్నారు. ఎయిర్ పోర్టు వచ్చే వాహనాలకు పాస్ తప్పనిసరి అంటున్నారు పోలీసులు.
రాజధాని అమరావతిలోని సభా స్థలికి చేరుకున్నారు మంత్రి నారాయణ. దగ్గరుండి సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మూడేళ్లలో ఖచ్చితంగా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు ఆయన. వరల్డ్ క్లాస్ సిటీని నిర్మిస్తామని చెబుతున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడతామన్న మంత్రి నారాయణ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటున్నారు.