ఆంధ్ర ప్రదేశ్
Narayana: మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం

Narayana: రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలన్నారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని తెలిపారు.
స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభం అయ్యాయన్నారు. భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహలు వద్దని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని నారాయణ తెలిపారు.