ఆంధ్ర ప్రదేశ్
Narayana: మోడీ పర్యటనకు సంబంధించిన పనులు 90 శాతం పూర్తి

Narayana: అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన పనులు 90 శాతం పూర్తయ్యాయని అన్నారు. రేపటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారని అన్నారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించారని అన్నారు. 43 వేల కోట్ల పనులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని అన్నారు. మూడేళ్లలో అమరావతి రాజధానిని నిర్మిస్తామన్నారు.