టాలీవుడ్
Manchu Manoj: కూర్చొని మాట్లాడుకుందాం.. ఏమంటావ్..?

Manchu Manoj: మరోవైపు.. హీరో మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. కూర్చొని మాట్లాడుకుందాం.. ఏమంటావ్ అంటూ ఎక్స్ వేదికగా మంచు విష్ణుకు ఛాలెంజ్ చేశాడు. కలిసి కూర్చొని మాట్లాడుకుందామంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు మిగిలిన వాళ్లను పక్కన పెట్టి చర్చించుకుందాం.. ఏం అంటావు? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు.
తాను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక నచ్చిన వాళ్లను తీసుకురావచ్చు లేదా డిబేట్ పెట్టుకుందాం అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తాను ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టా రనేది మాత్రం మనోజ్ డైరెక్ట్గా ఎక్కడా చెప్పలేదు. మరోవైపు మంచు కుటుంబంలో వివాదాల వేళ మనోజ్ పెట్టిన పోస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.