తెలంగాణ

Mahesh Kumar Goud: తెలంగాణలో బీఆర్ఎస్ పనై పోయింది

Mahesh Kumar Goud: బీఆర్ఎస్‌పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి విరుచుకు పడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనై పోయిందని విమర్శించారు. ఇక ఆ పార్టీ తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్ధతు ఇస్తోందని దుయ్యబట్టారు. బీజేపీకి సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఆత్మహత్యకు పాల్పడుతోందన్నారు.

ఆ పార్టీ అధినేత ఫాంహౌసుకే పరిమితం అయ్యారని ఇక ఆ పార్టీ కొలుకోలేదని తెలిసి, కేసీఆర్ ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాత ప్రభుత్వమన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button