ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో చిరుత కలకలం.. భయాందోళనలో స్థానికులు, భక్తులు

Tirumala: తిరుపతిలో చిరుత కలకలం రేపింది. కొద్ది రోజుల వ్యవధిలోనే చిరుతలు జన సంచారంలో సంచరిస్తూ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా తిరుపతిలో ని వేదిక్ యూనివర్సిటీ సమీపంలో చిరుత మళ్లీ కంటపడింది. రాత్రి సమయంలో దీన్ని గుర్తించారు. వరుసగా చిరుతలు కెమెరాలకు చిక్కడంతో ఇటు భక్తులు, అటు వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు.