తెలంగాణ
Telangana: LRS కోసం ఎదురు చూస్తున్నవారికి.. రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశం

Telangana: LRSకోసం ఎదురు చూస్తున్నా వారికి రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవలన్న అధికారులు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్దీకరణ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ డా.జ్యోతి బుద్ధ ప్రకాష్ అన్నారు.
ఇటీవల ప్రారంభించిన LRS దరఖాస్తుల పరిశీలన, అమలు చేసే విధానాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ ట్రింకుల్ జాన్, జిల్లా రిజిస్ట్రార్ సంతోషి కలిసి శంషాబాద్ సర్రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిశీలించారు. ఈ పథకం ద్వారా 2020 ఆగస్టుకు ముందు అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలను సక్రమం చేసుకోవచ్చ న్నారు ఐటీ బుద్ధ ప్రకాష్. ఈనెల31లోపు LRS చేసుకున్న యజమానులకు 25 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు.