తెలంగాణ
KTR: కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ

KTR: కేటీఆర్ ఫార్ములా-ఈ రేస్కు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఈ పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని ఇచ్చిన ఆదేశాల గడువు నేటితో ముగియనుంది. అయితే ఇప్పటికే ఈడీ కూడా దీనిపై నోటీసులు జారీ చేసింది.
వచ్చే నెల 7వ తేదీన కేటీఆర్ ను విచారణకు హాజరు కావాలని కోరింది. అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ అధికారి బీఎస్ఎన్ రెడ్డిని వచ్చే నెల 2,3 తేదీల్లో విచారణకు హజరు కావాలని కోరింది. మొత్తం మీద నేడు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటీషన్ పై ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.