తెలంగాణ

Kishan Reddy: దేశ అభివృద్ధిలో హైదరాబాద్‌ది కీలక పాత్ర

Kishan Reddy: పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదని మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదులతో పాటు వాళ్ల మద్దతుదారులను అంతం చేస్తామన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ప్రపంచదేశాలు మద్దతు పెరుగుతోంది.

ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చే వారిపై దృఢమైన, నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

అంగోలా అధ్యక్షుడు జోవో లౌరెంకోతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. పహల్గామ్‌ దాడిని అంగోలా తీవ్రంగా ఖండించింనందుకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. అంగోలా స్వాతంత్ర్య పోరాటానికి భారత్‌ సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button