తెలంగాణ
Hyderabad: కిడ్నీ రాకెట్ కలకలం.. అలకనంద ఆస్పత్రిని సీజ్

Hyderabad: హైదరాబాద్లో కిడ్ని రాకెట్ వ్యవహారం కలకలం రేపింది. కిడ్నీ రాకెట్ దందా నడుపుతున్న అలకనంద ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహణ, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని సమాచారంతో.. ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. 6 నెలల నుంచి కిడ్నీ దందా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.