ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో భవన నిర్మాణాలపై కీలక నిర్ణయాలు

అమరావతిలో భవన నిర్మాణాలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బిల్డింగ్ కట్టుకోవాలంటే 10శాతం ఏరియా మార్టిగేజ్ చేయాలన్నారు మంత్రి నారాయణ. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేస్తే అఫిడవిట్ సమర్పించాలన్నారు. గ్రౌండ్ నుంచి మూడు మీటర్లు ఉండే బిల్డింగ్కు బాల్కనీకి అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో మున్సిపల్ శాఖలో అనేక అంశాలు సడలించామన్నారు మంత్రి నారాయణ.