ఆంధ్ర ప్రదేశ్
Kannababu: చంద్రబాబువి కుళ్లు రాజకీయాలు

Kannababu: విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కూటమి సర్కార్ తీరుపై మాజీమంత్రి కన్నబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబువి కుళ్లు రాజకీ యాలంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
GVMC మేయర్పై అవిశ్వాసం పెట్టి నెలరోజుల సమయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా 74 మ్యాజిక్ ఫిగర్తో గెలిచామని గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలన్నారు. నైతికంగా విజయం వైసీపీ వైపే ఉందంటున్న మాజీమంత్రి కన్నబాబు.