Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేసిన వైసీపీ

Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడను వైసీపీ అధినేత జగన్ సస్పెండ్ చేశారు. తరచూ కుటుంబ కలహాలు, పలు వివాదాల్లో దువ్వాడ విమర్శలు ఎదుర్కోవడంతో పార్టీ పరువు పోతుందని పలువురు ఫిర్యాదులు చేశారు. అలాగే దువ్వాడ భార్య వాణి కూడా తన భర్తను సస్పెండ్ చేయాలని కంప్లైంట్ చేసినట్టు సమాచారం.
దీంతో పార్టీ అధినేత జగన్ దువ్వాడను సస్పెండ్ చేశారు. ముందుగా టెక్కలి ఇంచార్జి బాధ్యతల నుండి తప్పించి ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. దివంగత రాజశేఖర్ హయాంలోనూ దువ్వాడ పార్టీ నుంచి సస్పెండ్ అయినట్టు సమాచారం.
పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన తనను టెక్కలి సస్పెండ్ చేయడం దారుణమంటున్నాడు. తనను సస్పెండ్ చేయడానికి అహర్నిషలు కృషి చేసిన జిల్లా వైసీపీ నాయకుల కల నెరవేరిందన్నారు దువ్వాడ. పార్టీ సస్పెండ్ చేసినా ప్రజా సమస్యలపై తాను యధావిధిగా పోరాటం చేస్తామని చెప్పారు దువ్వాడ.