తెలంగాణ
నిమ్స్ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం

నిమ్స్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సిగరేట్ తాగి చెత్తలో వేయడంతోనే మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. లిఫ్ట్ పక్కన చెత్త ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. తొలుత సిగరేట్తో చెత్త అంటుకుని తర్వాత ఎలక్ట్రిసిటీ వైర్లకు నిప్పు అంటుకుందని వెల్లడించారు.
ఇక హాస్పిటల్లోని 5వ అంతస్తు ఖాళీగా ఉండటంతో అక్కడ చెత్తను పడేస్తోంది సిబ్బంది. అయితే గుర్తు తెలియని వారు అక్కడే సిగరెట్ తాగి పడేయడంతో మంటలు ఎగసిపడ్డాయ న్నారు పోలీసులు. కాగా నిన్న సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకోగా, గంటలోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చింది అగ్నిమాపక సిబ్బంది. అయితే మంటలు అదుపులోకి తీసుకొచ్చాక అధికారులు దర్యాప్తు చేపట్టారు.