తెలంగాణ
గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో దర్యాప్తు స్పీడప్

Sheep Distribution Scam Case: గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఈడీ ఎదుట పశుసంవర్ధశాఖ ఏడీ విచారణకు హాజరయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా గొర్రెల పంపిణీలో దళారులు మెయినుద్దీన్, విక్రముద్దీన్ పాత్రపై ఆరా తీస్తున్నారు.
గొర్రెల పంపిణీలో 700కోట్ల అవినీతి జరిగిందంటూ ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా గతంలోనే పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించారు. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఇక గొర్రెల పంపిణీ కేసు పూర్తి వివరాలు ఇప్పటికే తెప్పించుకున్నారు ఈడీ అధికారులు.