ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారి ఆలయం పోటులో సీబీఐ ఫోరెన్సిక్ బృందం తనిఖీలు

Tirumala: తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. శ్రీవారి ఆలయానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. తొలుత వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. అనంతరం పోటుకు చేరుకుని అక్కడ ఫోరెన్సిక్ బృందం ముమ్మర తనిఖీలు నిర్వహించింది. టీటీడీ చరిత్రలోనే సీబీఐ అధికారుల తనిఖీలు మొదటిసారి అని తెలుస్తుంది.
తనిఖీల్లో భాగంగా లడ్డూ, అన్నప్రసాదాల తయారీ కేంద్రాలను కూడా పరిశీలించారు. అదేవిధంగా పోటులో విధులు నిర్వహిస్తున్న కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అండ్ బూందీ తయారీ కేంద్రాన్ని వీడియో తీశారు అధికారులు. అనంతరం సిట్ కార్యాలయానికి వెళ్లారు.