జాతియం
కశ్మీర్లో భారత ఆర్మీ సెర్చ్ ఆపరేషన్

కశ్మీర్లో భారత ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బిజ్బెహరా, తాల్ ప్రాంతాల్లో బలగాల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. త్రాల్లోని లష్కరే ఉగ్రవాది ఆదిల్ షేక్ ఇల్లును కూల్చివే శారు. ఐఈడీ బాంబులతో ఉగ్రవాది ఇల్లు పేల్చేశాయి భారత బలగాలు. మరో ఉగ్రవాది ఆసిఫ్ ఇల్లు కూడా కూల్చివేసింది భారత ఆర్మీ. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆదిల్, ఆసిఫ్ సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చర్యలు తీసుకుంది.