జాతియం

India-Pakistan: పాక్ కాల్పులకు దీటుగా బదులిస్తున్న భారత ఆర్మీ

India-Pakistan: దాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు దిగింది. వరుసగా మూడోరోజు ఎల్‌వోసీ వెంబడి కాల్పులకు తెగబడింది. కశ్మీర్‌లోని తుత్మారి గలి, రాంపూర్‌ సెక్టార్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంది. పాక్‌ సైన్యం కాల్పులకు దీటుగా బదులిచ్చింది.

పహల్‌గామ్‌లో ఈ నెల 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయారు. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్‌ పౌరులు తక్షణమే భారత్‌ విడిచివెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కింది.

తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాల వేళ సరిహద్దుల్లో వరుస కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button