తెలంగాణ

గోల్కొండ మొదటి బోనం తో ప్రారంభమైన బోనాల పండుగ

Hyderabad Bonalu 2025:- తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వారసత్వంలో ప్రత్యేక స్థానం దక్కించుకున్న పండుగ బోనాలు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ పండుగకు హైదరాబాద్ నగరంలో విశేష ప్రాధాన్యత ఉంది.

గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయం ఈ పండుగ ప్రారంభం అవుతుంది. ఈ రోజు అక్కడ మొదటి బోనం సమర్పించడంతో బోనాల పండుగకు శ్రీకారం చుడుతుంది. శ్రద్ధాభక్తులతో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనం అనేది అమ్మవారికి సమర్పించే పవిత్ర నైవేద్యం. మట్టి పాత్రలో బియ్యం, పాలు, జగ్గెరు, నెయ్యి కలిపి, శ్రద్ధాభక్తులతో అమ్మవారికి సమర్పిస్తారు. పసుపు కుంకుమలు, చీరే సారెలు, నృత్యాలతో బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

బోనాల పండుగ కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాదు, ఇది మహిళల భక్తి, సామాజిక భాగస్వామ్యం, మరియు శక్తి ప్రతీకగా నిలిచే సమ్మేళన ఉత్సవం. ఈ పండుగ గోల్కొండ కోటలో మొదలై, ఉజ్జయినీ మహాకాళి, లాలదర్వాజ అమ్మవారు, గంగమ్మ ఆలయాల వరకు హైదరాబాద్ నగరాన్ని భక్తిరసంతో నింపుతుంది.

ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది పోతరాజు. పోతరాజు అమ్మవారి రక్షకుడిగా భావించబడి, బోనాల ఊరేగింపులో ముందుండి నర్తిస్తూ ఊహించలేని శక్తిని ప్రదర్శిస్తాడు. శరీరంపైప్రత్యేక అలంకరణతో , చేతిలో ఈరగోళ పట్టుకుని , ఎర్రటి కళ్ళతో, పెద్ద పెద్ద మీసాలతో , భయాన్ని కలిగించే వేషధారణతో పోతరాజు ఊరేగింపును ఉత్సాహభరితంగా చేస్తాడు. పోతరాజు పాత్ర పండుగలో శౌర్యం, శక్తి, అపశకునాల నివారణకు ప్రతీకగా నిలుస్తుంది.

బోనాల పండుగ కేవలం ఆధ్యాత్మిక భక్తిని కాదు, ప్రజల ఐక్యత, నమ్మకం, మరియు సాంస్కృతిక పరంపరల విలువను ప్రతిబింబిస్తుంది. గోల్కొండ మొదటి బోనం నుంచి లాలదర్వాజ వరకు జరిగే ఈ పండుగ, నగరాన్ని నెల రోజుల పాటు ఉత్సవ ఉల్లాసంతో పరవశపరిచేలా చేస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button