ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 74,510 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 28,050 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు.