ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతుంది.
కంపార్టమెంట్లు, షెడ్లు నిండి ఔటర్ రింగ్ రోడ్డులో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. తిరు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు భక్తులు కిటకిటలాడుతున్నాయి.



