ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం

Tirumala: తిరుమల భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ తిరుమల వేంకటేశ్వరస్వామి సేవలో తరించేందుకు భక్తులు తరలివస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి..హుండీలో కానుకలు సమర్పించుకుని మెుక్కులు చెల్లించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే శ్రీవారి సర్వ దర్శనం కోసం 21 కంపార్ట్మెంట్లో వేచి వున్న భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. ఇకపోతే నిన్న 62,971 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న 24,439 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఇకపోతే శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.99 కోట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button