ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్మెంట్లు దాటి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. శ్రీవారిని ఇప్పటివరకు 75 వేల 104 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 896 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.66 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.