ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు కావడంతో.. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులు వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామిఅమ్మవార్లను దర్శనం కోసం బారులు తీరారు.
స్వామిఅమ్మవార్ల దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మరోవైపు.. భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు అధికారులు.