తెలంగాణకు రెడ్ అలర్ట్.. మూడు రోజులు కుండపోత వర్షాలు

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో రాగల మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
గత కొన్నిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇక భాగ్యనగరం అయితే భారీ వర్షాల కారణంగా తడిసి ముద్దవుతుంది. నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. తెలంగాణవ్యాప్తంగా మూడు రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని.. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ , ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఆయా జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటకు రావాలని తెలిపారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలానే ములుగు, భద్రాత్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. వర్షాలతో పాటుగా బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరించారు. కనుక జనాలతో పాటుగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.