News
కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ

కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. అంతేకాదు కంచ గచ్చిబౌలి భూములపై మరో రెండు పిటిషన్లు దాఖలైనట్లు సమాచారం. కాగా ఇప్పటికే భూముల వేలం ఆపాలని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చెట్లు కొట్టివేయడం ఈరోజు వరకు ఆపాలని హైకోర్టు స్టే కూడా విధించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో నేడు రేవంత్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది.
దీంతో అన్ని పిటిషన్లు కలిపి కాసేపట్లో విచారించనుంది హైకోర్టు. ఇప్పటికే హెచ్సీయూ భూముల్లో ఎలాంటి పనులు చేపట్ట కూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది.