తెలంగాణ

Harish Rao: గోదావరి జలాలు ఎత్తుకుపోయేందుకు కుట్ర

Harish Rao: తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎలాంటి అనుమతులు లేకుండా రూ. 80 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు, మిగతా 50 శాతం ఎఫ్ఆర్‌బీఎం పరిధి మించి రుణ సమీకరణకు ఏపీకి అనుమతించడం అన్యాయమని ఆరోపించారు.

విభజన చట్టం ప్రకారం, కృష్ణా లేదా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరమన్నారు హరీష్ రావు. అయితే అందుకు విరుద్ధంగా, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం, నిధులిచ్చి సహకరించడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని వాపోయారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి ఏం లాభం? అని నిలదీశారు హరీష్ రావు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button