ఆంధ్ర ప్రదేశ్
Gottipati Ravi Kumar: గత జగన్ ప్రభుత్వంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్

Gottipati Ravi Kumar: జగన్ ప్రభుత్వం చేసిన తప్పులే ఇప్పటికి విద్యుత్ ఛార్జీలకు కారణమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ అండ్ కో బ్యాచ్ పనిగట్టుకుని ప్రభుత్వాన్ని అప్రతిష్టల పాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు రాయలసీమ, ప్రకాశం జిల్లాలో రెన్యుబుల్ ఎనర్జీకి పెద్దపీట వేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయడానికి టైం సరిపోవట్లేదన్న మంత్రి ఇప్పటికైన జగన్ బ్యాచ్ అబద్దాలు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.