ఆంధ్ర ప్రదేశ్
Gorantla Madhav: గుంటూరుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తరలింపు

Gorantla Madhav: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరుకి తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గుంటూరుకి తీసుకెళ్లారు పోలీసులు. రెండ్రోజుల పోలీస్ కస్టడీలో భాగం గా గోరంట్లపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్ల మాధవ్ను ఈ నెల 10న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ITDP కార్యకర్త చేబ్రోలు కిరణ్పై దాడికి యత్నించిన కేసులో గోరంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే కేసులో మరో ఐదుగురికి కూడా పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు. రేపు సాయంత్రం వరకు పోలీస్ కస్టడీలో గోరంట్ల మాధవ్ ఉండనున్నారు.