తెలంగాణ

Eatala Rajendar: ముగిసిన ఈటల రాజేందర్ విచారణ

Eatala Rajendar: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 20నిమిషాల పాటు బహిరంగ విచారణ చేసింది జస్టిస్ ఘోస్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై ఈటలపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణలో భాగంగా నిధుల కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు ఈటల రాజేందర్.

CWC, మహారాష్ట్ర అభ్యంతరాలతోనే తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు మార్చాల్సి వచ్చిందని అధికారులకు ఈటల వివరణ ఇచ్చారు. అయితే బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించరా అని ఈటలను ప్రశ్నించింది కమిషన్. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనేది ఆర్థిక శాఖకు సంబంధం లేదని చెప్పినట్లు ఈటల వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు 82వేల కోట్ల రూపాయల అంచనా వేసినట్లు కమిషన్ ఎదుట ఈటల చెప్పారని సమాచారం. తర్వాత అంచనా వ్యయం ఎంతకు పెరిగింది అనేది తనకు తెలియదని కమిషన్‌కు చెప్పారు ఈటల. అదేవిధంగా డీపీఆర్ కోసం వ్యాప్కోస్ సంస్థకు 595 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు తనకు తెలియదన్నారు ఈటల రాజేందర్.

ఇక నిధుల కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. అయితే నిధుల సేకరణ, ఖర్చు ఇరిగేషన్ శాఖ చూసిందని వివరించారు. ఎవరికి నిధులు విడుదల చేశారు అనేది ఇరిగేషన్ శాఖ పరిధిలోనే జరిగిందని కమిషన్ సభ్యులకు చెప్పారు ఈటల.యోగిస్తారో..?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button