ఆంధ్ర ప్రదేశ్
Bhimavaram: మద్యం మత్తులో యువకుల వీరంగం.. వీడియో వైరల్

Bhimavaram: నడిరోడ్డుపై యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ సీఎంఆర్ వద్ద.. నారాయణ కాలేజీ బస్సులో వెళుతున్న విద్యార్థిని కొట్టి, దుర్భాషలాడి వీరంగం సృష్టించారు. ఎందుకు కొట్టావని ఆ విద్యార్థి ప్రశ్నించినందుకు విద్యార్థిపై దాడికి దిగారు ఆకతాయిలు.
విద్యార్థి బస్సు ఎక్కి వెళ్ళిపోయినా ఆకతాయిలు బస్సును వెంబడించి నడిరోడ్డుపై వెకిలి చేష్టలు, డాన్సులు చేస్తూ దుర్భషలాడారు. యువకులు సృష్టించిన అలజడికి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.