ఆంధ్ర ప్రదేశ్

Bhimavaram: మద్యం మత్తులో యువకుల వీరంగం.. వీడియో వైరల్‌

Bhimavaram: నడిరోడ్డుపై యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ సీఎంఆర్ వద్ద.. నారాయణ కాలేజీ బస్సులో వెళుతున్న విద్యార్థిని కొట్టి, దుర్భాషలాడి వీరంగం సృష్టించారు. ఎందుకు కొట్టావని ఆ విద్యార్థి ప్రశ్నించినందుకు విద్యార్థిపై దాడికి దిగారు ఆకతాయిలు.

విద్యార్థి బస్సు ఎక్కి వెళ్ళిపోయినా ఆకతాయిలు బస్సును వెంబడించి నడిరోడ్డుపై వెకిలి చేష్టలు, డాన్సులు చేస్తూ దుర్భషలాడారు. యువకులు సృష్టించిన అలజడికి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button