తెలంగాణ

సంగారెడ్డి జిల్లాలో ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ పట్టివేత

Sangareddy: ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న కొకైన్‌ను ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ పోర్స్ అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గోవా నుంచి హైదరా బాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో 10 లక్షల విలువైన 10.30 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ఏపీ కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ సందర్భంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button