జాతియం

Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ .. ఓటేసిన ప్రముఖులు

Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 8.10శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఢిల్లీ సీఎం అతిశీ ఓటు వేశారు. ఇక తన సతీమణితో కలిసి ఆప్ నేత సిసోదియా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు జైశంకర్, హర్‌దీప్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మాణ్‌భవన్‌లోని పోలింగ్ కేంద్రంలో రాహుల్ గాంధీ ఓటు వేశారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరగా.. మాదీపూర్ ప్రాంతంలో ఓటింగ్ ప్రక్రియ ఆగిపోయినట్లు తెలుస్తుంది. వీవీ ప్యాట్‌లో సాంకేతిక లోపంతోనే ఓటింగ్ నిలిచిపోయినట్లు సమాచారం.

అలాగే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఓటు హక్కువినియోగించుకున్నారు. మయూర్ విహార్‌లోని పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలిసి ఓటు వేశారు సచ్‌దేవా. ఇక బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఆప్‌కి చెందిన పలువురు అభ్యర్థులు కూడా ఓటు వేశారు. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button