కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షీ సమావేశం

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీపై దృష్టి సారించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల రహస్య భేటీపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ఎ మ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్యేలతోనూ విడివిడిగా సమావేశం కానున్నారు. అలాగే జిల్లాల వారీగానూ దీపాదాస్ మున్షీ వరుస సమావేశాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు.
అనంతరం సాయంత్రం 4గంటల 15నిమిషాలకు కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో.. సాయంత్రం 5 గంటల 30నిమిషాలకు నల్గొండ, హైదరాబాద్, మెదక్ ఎమ్మెల్యేలతో అవుతారు. చివరగా సాయంత్రం 6గంటల 45నిమిషాలకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల రహస్య భేటీ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు.