ఆంధ్ర ప్రదేశ్
Babu Rao: పేదవాడికి ఒక రూల్.. పెద్దోడికి ఒక రూలా ?

Babu Rao: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల పోరాటం వల్ల కృష్ణ కరకట్ట రక్షణ గోడ నిర్మాణం జరిగిందన్నారు. 50 ఏళ్ల నుంచి ఉన్నవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 400 కోట్ల విలువైన పాత బస్టాండ్ స్థలాన్ని లులూ కంపెనీకి ఇస్తూ జీఓ ఇచ్చారని బాబూరావు అన్నారు. పేదలకు ఉండే ఇళ్లకు పట్టాలు ఇవ్వరా అని ప్రశ్నించారు. అమరావతి కరకట్ట ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యే, మంత్రుల ఇళ్లకు పట్టాలు ఇచ్చారు. మరి పేదలకు ఇవ్వరా అని మండిపడ్డారు.



