News

Revanth Reddy: సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం

Revanth Reddy: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి.. నేతృత్వంలోని బృందం విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టనుంది. ఈ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. సింగపూర్‌లో 17, 18, 19 తేదీల్లో పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు.

సింగపూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ని సందర్శిస్తారు. నైపుణ్యాభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తారు. తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్‌ ఐటీఈతో ఒప్పందం చేసుకుంటారు.

సింగపూర్‌ పర్యటన అనంతరం సీఎం బృందం ఈ నెల 20న దావోస్‌కు చేరుకుంటుంది. 20వ తేదీ నుంచి 22 వరకు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సు 2025లో పాల్గొంటుంది. పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచానికి.. తెలంగాణను పరిచయం చేసేందుకు.. దావోస్‌ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై ఒప్పందాలు చేసుకోనుంది సీఎం బృందం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button