Chandrababu: నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు లో నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో పనుల్లో పురోగతి గ్యాప్ 2, డయాఫ్రమ్ వాల్, వైబ్రో కంఫెక్షన్, ట్రంచ్ కటింగ్, డయాఫ్రమ్ వాల్ , 1330 మీటర్లు పనులు చేయవలసి ఉండగా కేవలం 600 మీటర్ల కాంక్రీట్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. అలాగే ఎగువ కాపర్ డ్యాం సీపేజీ నివారణ కోసం బట్రాస్ డ్యామ్ పనులను కూడా పరిశీలించనున్నారు.
అయితే డయాఫ్రమ్ వాల్ నూతన నిర్మాణం లో భాగంగా 329 ప్యానెల్స్ కు కాంక్రీట్ పనులు చేయవలసి ఉండగా కేవలం 29 ప్యానెల్ మాత్రమే ఇప్పటికి పూర్తయ్యాయి. ఇంకా 300 ప్యానెల్స్ పనులు చేయవలసి ఉన్నది. 1330 మీటర్లు డయాఫ్రం వాల్ కాంక్రీట్ పనులు చేయవలసి ఉండగా ఇప్పటికీ 600 మీటర్లు కాంక్రీట్ పనులు జరిగినవి. గ్యాప్ 3 లో కాంక్రీట్ పనులు మొత్తం పూర్తయినవి. గ్యాప్ 1 లో పనులు మాత్రం ఇంకా ప్రారంభించ వలసి ఉంది. ముఖ్యమంత్రి రాకతో మిగిలిన పనులు ఈ ఎండాకాలం సీజన్లో త్వరితగతిన వర్షాలు పడే లోపు పనులు ఊపందుకోవడానికి ఎంతో దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.