ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Chandrababu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై ఈనెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రజాభిప్రాయాల మేరకు ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది.
గూడూరు నెల్లూరు జిల్లాలోనే ఉండనుంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మార్కాపురం జిల్లాలో దొనకొండ, కురిచేడు మండలాలను చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు లేదు.



