Chandrababu: దావోస్లో కొనసాగుతోన్న చంద్రబాబు టూర్

Chandrababu: దావోస్లో ఏసీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. మూడోరోజు యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రాజెనెకా సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక విద్యుత్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం,.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటుకు.. రాష్ట్రం అనువైన ప్రాంతమని ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలకు వివరించారు.
పెట్రోకెమికల్ హబ్గా అవతరిస్తున్న మూలపేటలోనూ.. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా.. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించాలని.. పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈఓ మహమ్మద్ తౌఫిక్ను చంద్రబాబు కోరారు. విశాఖపట్నంలో చిప్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు.. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ను కోరారు. సంస్థ తన సర్వర్ సప్లై చైన్ను అనుసంధానించేలా తయారీ యూనిట్ను ఏపీలో నెలకొల్పాలని సూచించారు.