ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. 24 అంశాలపై చర్చ

Chandrababu: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. 24 అజెండాలపై చర్చ కొనసాగుతోంది. సమావేశంలో భాగంగా SIPBలో ఆమోదం తెలిపిన 11 అంశాలపై చర్చిస్తున్నారు. AP లెదర్ అండ్ ఫుట్ వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అదేవిధంగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని మార్చేందుకు ఆమోదం తెలపనుంది. పౌరసరఫరాల శాఖలో DMU వాహనాలను రద్దు చేయనుంది కేబినెట్.
అండ్ రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి ఆమోద ముద్ర పడనుంది. హత్యకు గురైన చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై కేబినెట్ చర్చించనుంది. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఏడాది పాలనపై ప్రచారం చేసే అంశంపై మంత్రివర్గం చర్చిస్తోంది.