ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: అధికార లాంఛనాలతో ముగిసిన చంద్రమౌళి అంత్యక్రియలు

Andhra Pradesh: పహల్‌గామ్ ఉగ్రదాడిలో అమరుడైన విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు భారీగా బంధువులు, ప్రజలు తరలివచ్చి చంద్రమౌళికి కన్నీటి వీడ్కోలు పలికారు. పాండురంగాపురంలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర మొదలవగా భారీగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. కూటమి నేతలు కూడా చంద్రమౌళి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

అంతకుముందు చంద్రమౌళి నివాసం వద్ద హోంమంత్రి అనిత ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అలాగే మంత్రి సత్య కుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అంతిమయాత్రలో పాల్గొని చంద్రమౌళి పాడె మోసారు. అశృనయనాల నడుమ చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. జ్ఞానాపురం స్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button