ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: తిరుపతిలో తొక్కిసలాట.. అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Chandrababu: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులను ప్రశ్నించిన సీఎం ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు.
భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికీ చెబుతున్నా బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి. తమాషా అనుకోవద్దంటూ మండిపడ్డారు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.