ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సంపద సృష్టించి పేదలకు పంచాలి

Chandrababu: సంపద సృష్టించి పేదలకు పంచాలన్నారు సీఎం చంద్రబాబు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది.
పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఆరు నెలల పాలనలో 12.94 శాతం వృద్ధి రేటు కనబడిందని చెప్పారు. ఫైళ్ల పరిశీలన వేగం పెంచాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.